108 లీటర్ల ఆవు పాలతో ఏకాదశ రుద్రాభిషేకం
పాలకుర్తి, నేటిధాత్రి:-
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి (పాలకుర్తి సోమన్న) దేవాలయంలో బుధవారం మార్గశిర మాసం
ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ”ఆరుద్రోత్సవం” కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మహా వైభవోపేతంగా జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఏకాదశ రుద్రాభిషేకం 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఆరుద్రోత్సవం కార్యక్రమంలో భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు. శ్రీరామదాసు భజన మండలి ఆధ్వర్యంలో భజన బృందాలు భజన బృందాలచే నిర్వహించిన భజనలు అలరించాయి.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.