బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల రాంపురం గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి.నవీన్ రావు డోర్నకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డిఎస్ రెడ్యా నాయక్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు బిఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై , రాంపురం గ్రామానికి చెందిన ముదిరాజు నాయకులు బోళ్ల ముత్తయ్య కొండ ఉపేందర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు, బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా నవీన్ రావు మాట్లాడుతూ మాట్లాడుతూ నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పక్ష పార్టీలకు ఓటేస్తే మోసపోయి గోసపడతామని తెలిపారు. బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద ఐదు లక్షల బీమా, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం, పేదింటి మహిళకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కెసిఆర్ ప్రకటించారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తోమ్మిది ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంతో పాటు డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి పనులు తో మారిందన్నారు. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఉంటున్న నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని, గతంలో ఏఎమ్మెల్యే చేయని అభివృద్ధి మన ఎమ్మెల్యే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. మరోక అవకాశం కల్పిస్తే రాష్ట్రంలోనే డోర్నకల్ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతానని తెలిపారు. ఈకార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,ఎంపీటీసీ కొమ్ము నరేష్,మండల రైతు సమన్వయ సమితి డైరెక్టర్ కొమ్ము చంద్రశేఖర్,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బందు పరశురాములు,బిఆర్ఎస్ నాయకులు దోమల సత్తయ్య,రాంపల్లి చిన్న వెంకన్న,అనుమూల నాగిరెడ్డి, ఈరగాని రావన్న, హెల్ది చిన్న మల్లయ్య,డా నాగన్న,కొమ్ము ఐలయ్య,దోమల అశోక్,ఏడ్ల నరసయ్య,గ్రామ సోషల్ మీడియా గోనె మహేష్,రాంపల్లి రంజిత్,దోమల విష్ణు, గంగరబోయిన రమేష్,ఇరగని రమేష్,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!