రాజారాం పల్లి యంపిటిసి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి కేటిఆర్!!! కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు!!
ఎండ పల్లి(జగిత్యాల) నేటి ధాత్రి, ఉమ్మడి వెల్గటూర్ మండలం రాజారాంపల్లి యంపిటిసి భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం , వార్డు సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ దుర్గం లింగయ్య మరియు ధర్మపురి నియోజకవర్గ స్థాయి నాయకులు 100 మంది యువత మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా కేటిఆర్ వారికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ రానున్న రోజుల్లో ఉన్నత స్థాయి లో ఉంటారని మంత్రి కెటిఆర్ అన్నారు