మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 39వ వర్ధంతి వేడుకలు శాయంపేట

నేటి ధాత్రి: శాయంపేట

మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39వ వర్ధంతి వేడుకలు సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగానివాళులు అర్పించడం జరిగినది ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను పంచిపెట్టిన గొప్ప ధీరశాలి పేద ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేసి వారి అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన వీరవనిత ఇందిరా గాంధీ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి తడుక కుమారస్వామి రఫీ మారపల్లి రాజేందర్ కట్టయ్య రాజు మార్కండేయ రాజయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *