కాన్కూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి అవగాహన సదస్సు

జైపూర్ , నేటి ధాత్రి:

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జైపూర్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో కాన్కూర్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత ఎం.వి రూరల్ ఫోక్ ఆర్చ్ ఆర్గనైజేషన్ కర్నూల్ కళాజాత వారిచే బ్యాంకు పథకాలపై బ్యాంకు స్కీమ్స్ పై క్రాప్ లోన్ పొదుపులోన్ హౌసింగ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ గోల్డ్ లోన్ రుణమాఫీ లపై ముఖ్యంగా సామాజిక భద్రత పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన,ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన నగతురహిత లావాదేవీల పై సైబర్ మోసాలపై జాగ్రత్త వహించాలని ప్రజలకు అర్థమైనటువంటి రూపకంగా మాటల ద్వారా పాటల ద్వారా మ్యాజిక్ షో ద్వారా కళాజాత బృందం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమనకు బ్యాంకు మేనేజర్ ఈశ్వర్ రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్, అటెండర్ తిరుపతి మరియు CA వినోద, రైతులు మహిళలు గ్రామ ప్రజలు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!