జిల్లా ప్రజలకు వైద్య సేవలు

జిల్లా ప్రజలకు వైద్య సేవలు

విద్యార్థుల చెంతకే ప్రభుత్వ వైద్య విద్యా ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ
మారుమూల గ్రామం అయిన భూపాలపల్లి దినదినాభివృద్ది చెందుతూ జిల్లాగా ఏర్పడి నేడు భూపాలపల్లి జిల్లా వైద్య సేవలకు నిలయంగా నిలుస్తుంది
భూపాలపల్లి జిల్లా లో 100 పడకల ఏరియా హాస్పిటల్ తో పాటు, మెడికల్ కాలేజ్, ఆయుష్ హాస్పిటల్ వచ్చి భూపాలపల్లి మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందడం జరిగింది.
భూపాలపల్లి మెడికల్ కళాశాల వల్ల విద్యార్ధులకు వైద్య విద్య లో సీట్ల సంఖ్య పెరిగి విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడే వైద్య విద్యను అభ్యసించే అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ గా 9 మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు.
అదే విధముగా 16 వతేదీన నూతన మండలం గా ఏర్పడిన గోరికొత్తపల్లి మండలం యొక్క తహసీల్దార్ కార్యాలయం ను మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నాం గోరికొత్తపల్లి ప్రజల కు అడ్మినిస్ట్రేషన్ సకాలంలో చేకూరుతుంది.
అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా 50 కోట్ల రూపాయల నిధిలను మంజూర చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా ముందుగా 30 కోట్లు ఒక్కసారి మిగిలిన 20 కోట్లు మంజూరు చేయగా భూపాలపల్లి పట్టణంలో నేను వార్డు విజిటింగ్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చిన మా మున్సిపల్ కౌన్సిలర్లు చెప్పిన ముఖ్యమైన పనులను గుర్తించి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ కొరకు పంపించడం జరిగింది.
త్వరలోనే వాటికి టెండర్లు పిలిచి,పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ జడ్పిటిసి శోభ రఘుపతిరావు భూపాలపల్లి నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!