జర్నలిస్టుల రైల్వేరాయితీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి
మహబూబాబాద్,నేటిధాత్రి:
జర్నలిస్ట్ లకు రైల్వే ప్రయాణంలో లభించే రాయితీలను పునరుద్దరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను యంపి మాలోత్ కవిత ప్రత్యేకంగా కలిసి కోరారు.జర్నలిస్ట్ ల సమస్యను కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి చర్చించారు.అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని సమాచారం.తమ పక్షాన కేంద్రరైల్వేమంత్రిని కలిసిన యంపి మాలోత్ కవితకు పలువురు జర్నలిస్ట్ సంఘాల నాయకులు,జర్నలిస్ట్ లు దన్యవాదాలు తెలిపారు.