Subsidy Jilugu Seeds Available for Farmers
ప్రభుత్వ రాయితీ పై అందుబాటులో జీలుగ విత్తనాలు ఏవో సురేందర్ రెడ్డి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
వానాకాలం సీజన్లో పచ్చి రొట్టె ఎరువులు రైతులు వేయుటకు గాను ప్రభుత్వం జీలుగు విత్తనాలు 50% సబ్సిడీపై అందజేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి తెలిపారు జీలుగు విత్తనాలు రాయితీపై 834 బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు రైతులకు 30 కేజీల బస్తాకుగాను 2452. 50 రూపాయలు చెల్లించాల్సిన ఉంటుందని తెలిపారు ఈ పచ్చి రొట్టె విధానం జీలుగాను పొలంలో సాగు చేసి 40 నుండి 45 రోజులు కు పూత దశలో ఉన్నప్పుడు భూమిని కలియ దుండడం వల్ల భూసారం పెరుగుతుంది దీనివల్ల దిగుబడి బాగా వస్తుందని పచ్చి రొట్టెరువు విత్తనాలు కావాల్సిన రైతులకు పట్టా పాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ లతో ఆయా స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారి గాని సంప్రదించగలరని తెలిపారు
