Malyala School Achieves 100% Pass
పదవ తరగతి ఫలితాలలో మల్యాల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
చందుర్తి, నేటిధాత్రి:
నిన్న విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో చందుర్తి మండలం లోని మల్యాల ఉన్నత పాఠశాలలో మొత్తం 47 మంది విద్యార్థులకు అందరు పాసై 100% ఉత్తీర్ణత సాధించినారు. ఇందులో 20 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులతో విజయ దుందుభి మ్రోగించినారు. 563 మార్కులతో పులికీర్తన, 556 మార్కులతో ఎల్ల చరణ్ పాఠశాలలో ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచినారు.
గణితంలో 15 మంది, సాంఘిక శాస్త్రంలో 14 మంది, ఆంగ్లంలో 11 మంది విద్యార్థులు 90కి పైగా మార్కులు సాధించినారు.500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గ్రామ సర్పంచ్ మందాల శారద అబ్రహం, గ్రామ ఉపసర్పంచ్ అనపర్తి నరేష్,గ్రామ పాలకవర్గ సభ్యులు అభినందించి ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు పీసరి మంజుల, స్వామి వివేకానంద సేవ సమితి సభ్యులు, ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
