BJP Demands Implementation of Six Guarantee Schemes
ఆరు గ్యారెంటీ పథకాల లబ్ధిని తక్షణమే ప్రజలకు అందించాలి
– సిరిసిల్ల పట్టణ తహసిల్దార్ కి వినతి పత్రం
– సిరిసిల్ల బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్
–
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణ తహసిల్దార్ కి సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, కమిటీ తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ఆరు గ్యారెంటీ పథకాల లబ్ధిని తక్షణమే ప్రజలకు అందించాలని తహసిల్దార్ ని కోరడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం తగదని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు కనకయ్య, నరసయ్య, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, దేవరాజు, సూరం వినయ్, అంకారపు రాజు తదితరులు పాల్గొన్నారు.
