Harish Rao Slams Govt Over Minority Welfare
మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
◆-: కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండున్నరేళ్ల పాలనలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని హరీశ్ రావు విమర్శించారు.
◆-: వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే (బి.ఆర్.ఎస్) మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
◆-: జహీరాబాద్లోని ఒక స్థానిక గౌరీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
◆-: తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, ప్రస్తుత పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండున్నరేళ్ల పాలనలో మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం స్థానిక గౌరీ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన మైనారిటీ గురుకులాలు నేడు మంచి ఫలితాలను ఇస్తున్నప్పటికీ, ఉపాధ్యాయుల కొరత, భవన అద్దె

చెల్లించకపోవడం, ప్రాథమిక సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు టీసీలు తీసుకొని అనేక మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లను వదిలి వెళ్తున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీ పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. జహీరాబాద్ పట్టణంలో మైనారిటీల కోసం స్మశాన వాటిక, మినీ హజ్ హౌస్, షాదీ ఖానా పనులను తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి ప్రారంభించినప్పటికీ, ఈ ప్రభుత్వం ఆ పనులను అకస్మాత్తుగా నిలిపివేసి, నిధులను ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా మైనారిటీలను విస్మరిస్తుందని మరోసారి నిరూపించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నామా రవికిరణ్, ఇంటి గౌరి, జియాగౌరి, గోరేమియా సికందర్, యాకూబ్, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
