DISHA Meeting Focuses on Effective Implementation of Government Schemes
ప్రభుత్వ పథకాలు విజయ వంతం అయ్యేలా కృషి చేయాలి
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి
అభివృద్ధి సమన్వపర్య వేక్షణ కమిటీ (దిశ) సమావేశం
శాయంపేట నేటిధాత్రి:
హన్మకొండలోని కలెక్టర్ కార్యా లయం (ఐ.డి.ఓ.సి)లో నిర్వ హించిన జిల్లా అభివృద్ధి సమ న్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ కడి యంకావ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమా వేశంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావుపాల్గొన్నారు.సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురో గతి, ప్రజ లకు అందుతున్న సేవలపై అధికారులు వివరా లు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ శాయంపేట మండలంలోని ప్రభుత్వ గురుకుల మరియు ప్రభుత్వ పాఠశాలలో టాయి లెట్స్ అంతర్గతo లేకుండా ,కోతుల బెడద లేకుండా , కిచెన్ షేడ్స్ నిర్మాణం చేయా లని, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడాలని, అదే విధంగా మండలంలోని గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సమస్య లేకుండా,అభివృద్ధి కార్యక్ర మాలు వేగవంతంగా అమలు చేయాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.అదేవిధంగా పలు అభివృద్ధి పనులపై చర్చించి సంబంధిత అధికారు లకు తగిన సూచనలు చేశా రు. ఈ సమావేశంలో దిశ వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరంగల్ మేయర్ గుండు సుధారాణి , కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ చాహత్ బాజిపై , జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధు లు మరియు సంబంధిత విభా గాల అధికారులు పాల్గొన్నా రు.
