Foundation Laid for New District Court Building in Sircilla
సిరిసిల్లలో నూతన జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన
హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఘనంగా ప్రారంభం
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి:)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించనున్న నూతన జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. న్యాయ వ్యవస్థ అభివృద్ధి దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి మరియు జిల్లా కోర్టుపరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాం జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అదేవిధంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం భూమి పూజ కార్యక్రమం పాల్గొని,
విద్యార్థిని విద్యార్థులు చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగినది.
నూతన జిల్లా కోర్టు భవనం నిర్మాణంతో సిరిసిల్ల జిల్లాలో న్యాయ వ్యవస్థ మరింత బలపడటమే కాకుండా ప్రజలకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
