ఘనపూర్ స్టేషన్ (జనగాం) నేటిధాత్రి
ఘనపూర్ మండల కేంద్రం లోని మహాలక్ష్మి ధియేటర్ యాజమాన్యం ఆగడాలకు హద్దే లేదు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న యాజమాన్యం, దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ మాట్లాడుతూ థియేటర్ యాజమాన్యం పైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ధియేటర్ లో ఏసీ అని చెప్పి కనీసం ఫ్యాన్లు కుడా లేవని గతంలో మొదటి, రెండవ, మూడువ, తరగతలు చొప్పున ధరలు ఉండేవి అలా కాకుండా మొత్తం అన్ని కేటగిరీ కి ఒక్కటే ధర టికెట్ల కు వంద రూపాయలు మాత్రమే అని దాదాపు రెండు సంవత్సరాలనుండి పెట్టారు అలాగే గత రెండు సంవత్సరములు నుండి 100 కంటే ఎక్కువ 150 రూపాయలు ధర పెంచడం జరిగింది. రెండు సంవత్సరాలనుండి వంద రూపాయలు ఉండేది పుష్ప సినిమా నుండి నూట యేబది రూపాయల (150) వరకు తీసుకుంటున్నారు ఇప్పుడు R R R సినిమా నుండి 175 వరకు తీసుకుంటాం అంటున్నారు.
యాజమాన్యం వారిని అడిగితే ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ధరలు పెంచుతున్నామని RRR సినిమాకు నూట డెబ్బది ఐదు రూపాయలు (175) వరకు పెంచుతామని చెబుతున్నారు. ఇది ప్రజలపై పెను భారమే అవుతుందని వారన్నారు. ఒక పక్క కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో థియేటర్ యాజమాన్యం మరోసారి ప్రజల పై పెనుభారం మోపే విధంగా ప్రయత్నిస్తుంది ప్రజల ఆరోగ్యం పట్ల కువైట్ డెల్టా ప్లస్ ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఇస్తుంటే కనీసం శానిటైజర్ గాని సోషల్ డిస్టెన్స్ గాని మాస్కు ధరించి వస్తున్నారా ప్రజలు లేరా అని చూడకుండా ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే ధియేటర్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ముఖ్యంగా తాగునిరు లేకపోవడం శానిటేషన్ చేయకపోవడం మూత్రశాలలు శుభ్రపరచి కుండా కనీసం చేతులు కడుక్కోవడం కోసం గాని నీటి సదుపాయాలు లేవు ఏసీ కాదు కదా కనీసం ఫ్యాన్లు కుడా లేకపోవడం విడ్డూరంగా ఉందని దోమలు దురవాసన వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తెరాస ప్రభుత్వం ధియేటర్ యాజమాన్యలకు వంత పడుతుంది ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ధియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని లేకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాము అని అని అవసరమైతే ప్రజల కొరకు ధర్నా ను చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని థియేటర్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాము, ఈ కార్యక్రమంలో కోటి ఎల్లయ్య, శ్రీనివాస్, రాములు, రాజేష్, రాజు, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు