Government Fails Farmers on Urea Supply: Kande Ravi
ఈ ప్రభుత్వం మొదటి నుండి యూరియా విషయంలో విఫలమే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ.. రైతులు వాన కాలంలో యూరియా సకాలంలో దొరుకక ఇబ్బంది పడ్డట్టుగానే యాసంగిలో కూడా పడుతున్నారు దానికి తోడు యూరియాకు ఒక యాప్ ను తీసుకొచ్చి చదువురాని రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇంకా కొద్ది రోజులు ఆగితే రైతులు డిగ్రీ పాసైన సర్టిఫికెట్లు తెచ్చుకుంటేనే యూరియా ఇస్తాం అనే నిబంధన తీసుకువచ్చేటట్టుగా అనిపిస్తుంది యూరియా దొరకక రైతులు పంటలు వేయాలంటే భయపడుతున్నారు ఈ ప్రభుత్వం మొదటి నుండి యూరియా విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ ప్రభుత్వం మారితేనే రైతులకు యూరియా దొరుకుతుందా ఏ లాంటి షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి యూరియా అందించడం శాత గాదని చెప్పకుండా కొత్త యాప్ ని పట్టుకొచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వానికి ఈ అదే రైతులతో అన్ని మండల కేంద్రాలలో ధర్నా రాస్తారోకాలు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
