Zaheerabad Municipal Oath Ceremony Postponed Amid Tight Security
కాంగ్రెస్ ఖాతాలో చైర్మన్,వైస్ చైర్మన్ పీఠాలు.
బెల్లంపల్లి నేటిధాత్రి:
బెల్లంపల్లి లో చైర్మన్,వైస్ చైర్మన్ పిఠము దక్కించుకున్న కాంగ్రెసు పార్టీ.
బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. మున్సిపాలిటీ 34 వర్డ్స్ ఉండగా 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా పీఠం దక్కించుకున్నారు.అలాగే 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేపట్టారు.
బెల్లంపల్లి లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఇండిపెండెంట్ 4 బిజెపి 1 కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా ఫోరం 19 స్థానాలతో చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవులతో గెలుపొందింది.
ఓట్ల లెక్కింపు రోజే గెలుపొందిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ క్యాంపు తరలించింది. క్యాంపును మహారాష్ట్రకు తరలించగా మూడు రోజులు అనంతరం ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ 14 సీట్లు తో క్యాంపుకు వెళ్లిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లను బుజ్జగింపుల్లో విప్లమై ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
మొత్తం మీద బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్గా దావా స్వాతి వైస్ చైర్మన్గా రగం శెట్టి సత్యనారాయణ ప్రమాణస్వీకారం నిర్వహించారు.
ఈ ప్రమాణస్వీకారాలను సబ్ కలెక్టర్ మనోజ్ , ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
