Minister Inspects SC, ST Girls Hostels
పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ.
#ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘం పిఆర్డియు టి ఎస్.
#తహసిల్దార్ ముప్పు కృష్ణ.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్న ఏకైక సంఘం పిఆర్టియు టీఎస్ అని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బుధవారం నందిగామ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మండలంలో విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్ టి యు సంఘం ముందు వరుసలో ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య భాస్కర్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్ రెడ్డి, ఎంఈఓ అనురాధ, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్, అంతర్జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర, పిఆర్ టి యు ప్రధాన కార్యదర్శులు ఉడుత రాజేందర్, బానోతు కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చంద్రశేఖర్, రామస్వామి, వెంకటేశ్వర్లు, కృష్ణ, జాకీర్ హుస్సేన్, వెంకటయ్య, సంధ్యారాణి, సుచరిత, వెంకటకృష్ణ, సదా చారి తదితరులు పాల్గొన్నారు.
