Demand for Strict Enforcement of Agency Tribal Laws
ఏజెన్సీలో ఆదివాసీల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్
గుండాల,నేటిదాత్రి:
గుండాల మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల ముఖ్య నాయకుల సమావేశం పూనెం రమణ బాబు అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశనికి ముఖ్య అతిధిగా ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి సి దొర పాల్గొని మాట్లాడుతూ గుండాల మండల కేంద్రం లొకి 1970 తర్వాత నుంచి నేటి వరకు విచ్చలవిడిగా వలస గిరిజనేతరలు వస్తున్నా కానీ స్థానిక పంచాయతీ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరించడం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరి కొరకు మీరు ఇక్కడి నియమించబడ్డారు అని తెలుసుకోవాలని అన్నారు.
నేటి తెలంగాణకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుల రాష్ట్రాల నుంచి మరియు తెలంగాణలోని మైదన ప్రాంతాల నుంచి గిరిజనేతరులు మరియు లంబాడీలు గుండాలకు విచ్చలవిడిగా 1/70 చట్టానికి విరుద్ధంగా వలసలు వచ్చి, ఏదేచ్చగా అధిక ధరలు వెచ్చించి భూములు కొని,
బహుళ అంతస్తులు నిర్మించుకొని వ్యాపారాలు,వడ్డీ వ్యాపారాలు యదేచ్ఛగా చేస్తున్న కానీ పంచాయితీ అధికార్లు కాని రెవిన్యూ అధికార్లు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడ 1/70 చట్టం ఉందా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.గుండాల మండల పరిధిలోని వలస గిరిజనేతరుల ఆదీనంలో ఉన్న భూలను ప్రభుత్వం వెంటనే హస్తంగతం చేసుకొని,ఎల్టీఆర్ కేసులు నమోదు చేసి,బహుళ అంతస్తులు వ్యాపార గిడ్డంగులను నేలమట్టం చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
దీని కొరకు వచ్చే నెల డిసెంబర్ 2న గుండాల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేయాలి అని సన్నాహక సమావేశం నిర్వహించారు. దానికి ఆదివాసులు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లొ ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పెండెకట్ల మహేష్,గోగ్గేలా సుధాకర్,పూనెం వసంత్,
జబ్బ సుధాకర్ ,తాటి పాపారావు,తెల్లం కిరణ్, చీమల ప్రశాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
