ములుగు జిల్లా,నేటిధాత్రి:ములుగు జిల్లా కేంద్రంలోని రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు యొక్క ప్రాధాన్యత వివరించారు జిల్లా ఉద్యాన అధికారి బీ వి రమణ ఈ సంవత్సరం ములుగు జిల్లాలోని 1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యాన మరియు వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కృషి చేద్దామని ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ పథకం నందు మొక్కలకు 90% రాయితీ పోను రైతు వాటాగా 20 రూపాయలు ఒక్క మొక్క కు చెల్లించవలెను అదేవిధంగా డ్రిప్ కొరకు ఎస్సీ ఎస్టీ రైతులకు 100% మరియు మిగతా రైతులకు 90 శాతం రాయితీ ఇవ్వబడును మొక్కల నిర్వహణ కొరకు సంవత్సరానికి హెక్టార్కు 5వేల రూపాయల చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతర పంటల సాగు కొరకు హెక్టార్కు 5వేల రూపాయలు చొప్పున మొదటి మూడు సంవత్సరాలు ఇవ్వబడును అని తెలియజేశారు వ్యవసాయ నివిస్తరణ అధికారులను తమ క్లస్టర్ నందు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సాహనిచ్చగలరని సూచించారు ఈ సమావేశం కు జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా ఉద్యాన అధికారి ములుగు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు ఉద్యాన అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఆల్ఫామ్ కంపెనీ ప్రతినిధులు మరియు డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు