రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారేడ్డి
వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం లో
దేవాదుల కాలువమీదుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.రైతును రాజును చేయడమే లక్ష్యమని అని సీఎం కేసీఆర్ అన్నమాటను నిజం చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం మండలం బొల్లికుంట గ్రామం వద్ద దేవాదుల కాలువమీదుగా బొల్లికుంట,ఆశాలపల్లి,రామచంద్రాపురం, గవిచర్ల గ్రామాల మీదుగా కెనాల్ పై ద్విచక్రవానంపై ప్రయాణిస్తూ నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను పరిశీలించారు.త్వరలో పూర్తికానున్న కాలువ నిర్మాణంతో వచ్చే జూన్ మాసంలో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కాలువ నిర్మాణ పనులు రైతుల సహకారంతో పూర్తచేసినట్లు వారు తెలిపారు.గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *