రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 

పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోని మాట్లాడారు. 

బండి సంజయ్ కామెంట్స్…

ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగించుకొని మొదటి సారిగా సిరిసిల్ల కు వచ్చాను.

ప్రజా సంగ్రామ యాత్ర వల్ల కేసీఆర్ కుటుంబంలో భయం మొదలైంది. 

ముఖ్యమంత్రి కుటుంబం సంస్కారం లేని కుటుంబం. 

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపెట్టాలి. 

రైతు ద్రోహి కేసీఆర్. 

రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఎత్తిసినవ్. 

6 వేల కోట్ల రూపాయలతో రామగుండంలో తిరిగి ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించిన ఘనత కేంద్రానిది. 

కేసీఆర్ కుటుంబం మీద వస్తున్నా అవినీతి ఆరోపణలు ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కొత్త నాటకాలు ఆడుతున్నాడు. 

కేంద్రం ఇచ్చిన బియ్యం అమ్ముకుంటివి. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళించినవ్. 

గ్రామ పంచాయతీలకు, కార్పొరేషన్ లకు, మున్సిపల్ కు ఒక్క రూపాయి ఇవ్వకపోతివి. 

కేసీఆర్ కుటుంబం మోడీని తిట్టడానికి, విమర్శలు చేయడానికి రాజకీయం చేస్తున్నది. 

ఎన్నకల సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని డల్లాస్, అమెరికా చేస్తన్నావ్. 

బిఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ పార్టీ పేరును తీసేశారు. 

ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చినవ్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 

తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యవస్థను చూసిన నష్టాల్లోకి తీసుకు పోయారు. 

దేశాన్ని ఏం అభివృద్ధి చేస్తావో చెప్పాలి. 

పంజాబ్ రాష్ట్రంలో రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లలేదు.

అద్భుతం చేస్తా అన్నావు ఏం చేసినవ్. 

మోదీ వస్తే ఎందుకు పారిపోతున్నావ్. 

రాష్ట్రానికి ఏం కావాలో ఎందుకు అడగడం లేదు. 

అభివృద్ధి మీద చర్చ జరగాలి. 

లిక్కర్ కేసులో కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. 

రాష్ట్రంలో అర్హులైనా వారికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదు. 

నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదు.  

దళితులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు.

అధికార పార్టీ మెంబెర్స్ ఉన్నప్పుడు లాభాల్లో ఉన్నా సెస్ ను నష్టాల్లో ఎందుకు పోయింది. 

సెస్ నష్టపోవడానికి కారకులుమీరు కదా..? సెస్ లో 33 కోట్ల అవినీతి జరిగింది నిజం కదా..? విచారణ ఎందుకు చేయలేదు. 

పవర్ లూమ్ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదు. 

రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదు. 

సెస్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గల్లంతు కాబోతుంది. 

రేపు తెలంగాణలో వచ్చేది బీజేపీ పార్టీ ప్రభుత్వమే.  

సెస్ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. సెస్ ను లాభాల్లో తీసుకెళ్లండి. 

గతంలో బిఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు చేసినోని ఆస్తులు బయటకు తీస్తాం. 

సెస్ ను నష్టాల్లో లాగిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాదా. 

ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వెయ్యకండి. 

మళ్ళీ వాళ్ళు గెలిస్తే సెస్ ను అమ్ముకుంటారు. 

సెస్ ను నాశనం చేసిన నాయకున్ని సంకలో పెట్టుకున్నాడు కేటీర్. మళ్ళీ అదే దొంగకు ఓట్లు వేయమని కోరుతున్నాడు.  

విలేకరులను, పొలీస్లను తిట్టే కుటుంబం కేసీఆర్ ది. 

కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతి మయంలో కూరుకుపోయింది. 

ప్రజల సంక్షేమ పథకాలకు కేసీఆర్ పేరు ఎలా పెడుతారు. 

బిఆర్ఎస్ నాయకులు దొంగ దందాలు, లంగ దందాలు చేస్తున్నారు. 

సెస్ ను కాపాడుకునే విదంగా మనం పోవాలి. 

ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల అధికారులు లొంగితే రేపు మీ జాబులు పోతాయి. 

రాష్ట్రం లో రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 

రాష్ట్రంలో తలకాయ లేని హెల్త్ డైరెక్టర్ ఉన్నాడు. 

రాష్ట్రం లో అవినీతి పరుల అధికారుల చిట్టాను మొత్తం బయటకు తీస్తాం. 

సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా సెస్ ఎన్నికలు జరగాలి. అడ్డదారిలో అధికారులు ప్రయత్నిస్తే జిల్లా అధికారులు బాధ్యత వహించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *