మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు జోరు

 

బచ్చన్నపేట (జనగామ) నేటిధాత్రి:తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మునుగోడు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి తో కలిసి నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులో తెలంగాణలో అధికారంలోనికి రాబోతుందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట కాంగ్రెస్ నాయకులు బాలకిషన్ గౌడ్ , విద్యనాథ్, చల్ల సురేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి, సందేలా రాము, మినలాపురం సిద్దులు, కంటెమ్ కర్ణాకర్, హరినాథ్, ఏలిమెల్లి వెంకటేశ్, హరీరాములు, పరమేశ్వర్ రెడ్డి, సంజయ్, కొమ్ము శ్రీధర్, బత్తిని రాజలింగం, అరెళ్ల భాస్కర్, మానేపల్లి నర్సయ్య, బత్తిని సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *