మహా కార్యాన్ని మలినం చేయం.

దళిత బంధు పనుల బాధ్యతల నుండి మమ్మల్ని తప్పించండి….. https://netidhatri.com/దళిత-బంధు-మేసిన-రాబందులె/

గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన గ్రామ కార్యదర్శులు…….. కెసిఆర్ https://netidhatri.com/దళిత-బంధు-ట్రాక్టర్లు-ఆం/

ప్రభుత్వం మానస పుత్రికగా అభివర్ణించిన దళిత బంధు పథకం,దళిత జాతి ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో, https://netidhatri.com/దళిత-బంధు-లో-దగా-దగా/

ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గం లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంద్ పథకానికి ఉన్నతాధికారుల https://netidhatri.com/దగా-చేసేది-మీరేనా-ఆత్మాభ/

నిర్లక్ష్యం,లంచగొండితనం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుకారి,లబ్ధిదారులు లాభంhttps://netidhatri.com/అత్యవసరంగా-మీటింగ్-అన్న/

పొందక పోగా,మధ్యలో బ్రోకర్లు,కొద్ది మంది ఉన్నతాధికారులు, వ్యాపారులు,కోట్ల రూపాయలు మూట గట్టుకున్నారని,గత కొద్దిరోజులుగా నేటి ధాత్రి దినపత్రిక లో వస్తున్న వరుస కథనాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.నష్ట నివారణ చర్యల్లో భాగంగా గ్రామ కార్యదర్శులకు దళిత బంధు ఆస్తుల ఫోటో రికార్డింగ్ చేసి నివేదికలను తయారు చేయాలంటూ బాధ్యతలను అప్పగించారు. ఉన్నతాధికారుల కనుసనల్లో ఈ భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో,గ్రామ కార్యదర్శుల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.రికార్డులలో చూపినట్టుగా దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థలు, వాహనాలు, ఇతర ఆస్తులు కనబడటం లేదని,కొన్ని వాహనాలు అమ్ముకున్నారని, మరికొన్ని వాహనాలు వేరే ప్రాంతాల్లో లబ్ధిదారులు లీజుకి ఇచ్చుకున్నట్లుగా తెలుస్తుందని, అంతేకాకుండా ఒకే వ్యాపార సంస్థను ఇద్దరు ముగ్గురు పేర్లతో నమోదు చేసుకున్నారని,ఇలాంటి సమయంలో తాము దళిత బంధుఆస్తుల ఫోటో సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించలేమని,ఈ బాధ్యత నుండి తమను తప్పించాలంటూ, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఆయా గ్రామాల కార్యదర్శులు జిల్లాకలెక్టర్ కు స్థానిక ఎంపీడీవో ద్వారా వినతి పత్రాన్ని పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *