ఫ్రైవేట్ ఉపాద్యాయులు అవార్డులకు పనికిరారా…!

*సగం జీతాలకే గంటల తరబడి విద్యార్థుల భవిశ్యత్ కోసం కష్ట పడుతున్నాము*

 *గ్రామ సర్పంచ్ పిల్లల నుండి దేశ నాయకుల పిల్లలు చదువు నేర్చుకునేది ఫ్రైవేట్ ఉపాద్యాయుల దగ్గరే కదా*

 *చివరికి ప్రభుత్వ ఉపాద్యాయుల(ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహితలు) పిల్లలు కూడ చదువుకునేది ఈ ప్రైవేట్ ఉపాద్యాయుల వద్దే కదా*

 *పదవ తరగతి ఉత్తీర్ణతలో ప్రభుత్వ శాతం ఎంత…? ప్రైవేట్ శాతం ఎంత..?*

 *తెలంగాణ రాష్ట్రంలో 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 3 లక్షల మంది ఉపాద్యాయులు పనిచేస్తున్నారు*

 *ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాద్యాయుల శ్రమ ను గుర్తించి, సత్కరించాలి.*

 *తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ )వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ చౌహన్ డిమాండ్*

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న, ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి,సత్కరించాలని *”తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ “* వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ చౌహన్ . మాట్లాడుతూ, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యకు ఉన్నతమైన ప్రాధాన్యం ఇవ్వాలని, నాణ్యమైన విద్యను అందించేలా, విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ప్రైవేటు పాఠశాలల్లో 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 30 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. తక్కువ జీతాలతో రోజుకు 8 గంటల నుండి 12 గంటలకు పైగా పనిచేస్తూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి విద్యాభివృద్ధి కోసం, వివిధ బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షల్లో రాణించడం కోసం, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతూ ఫలితాలను రాబడుతున్నారు. వీరు పని చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపునిస్తుంది, అందులో చదివే పిల్లలను కూడా ప్రభుత్వం గుర్తించి, వివిధ బోర్డు, పోటీ పరీక్షలకు, స్కాలర్ షిప్ లకు ఎంపిక చేస్తుంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం, తక్కువ జీతాలతో అధికంగా పనిచేస్తూ, అర్ధాకలితో అలమటిస్తూ, విద్యా-బోధనే ఏకైక వృత్తిగా, ఆహోరాత్రులు పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు అనేదే మా ప్రశ్న. కరోనా, లాక్ డౌన్ సమయంలో కూడా, వేలాది మంది ఉపాధ్యాయులు సగం జీతాలకే ఆన్లైన్లో గంటల తరబడి తరగతులు నిర్వహించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల,రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల పిల్లలకు విద్యను బోధించేది ఈ ప్రైవేటు ఉపాధ్యాయులే. తరగతుల బోధనే కాకుండా, ఎంతోమంది ఉపాధ్యాయులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమాజానికి సేవ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు, రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అలాంటి ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు..? 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 5 న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి. ఆ రోజున ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి, సత్కరిస్తుంది. ప్రైవేటు ఉపాధ్యాయులను ఎందుకు గుర్తించవు..?సత్కరించవు…? ఈ ప్రభుత్వాలు… అనేదే ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడి ప్రశ్న. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులే…అందులో తేడాలోద్దు. ఉపాధ్యాయ దినోత్సవం కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులదే కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయులది కూడా. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాల్సిన అన్ని అర్హతలు ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఉన్నాయి. కావున సెప్టెంబర్ 5 న నిర్వహించు గురుపూజోత్సవం సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి, సత్కరించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల పక్షాన, *”తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ “(TAPTA)* ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.

బడి ఒక ఆలయం అయితే, ఆ ఆలయంలో దేవుడు గురువు విద్యార్థులకు నైవేద్యం ఇచ్చే మాధవుడు గురువు అజ్ఞాన తిమిరాన్నించి విజ్ఞాన కాంత్రులు ప్రసరింపజేసేవాడు ఉపాధ్యాయుడు ఆ ఆంద యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఉపాధ్యాయుడే ఋషి.మానవ జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర ప్రదాత,సమాజ దేవాలయానికి నిజమైన పరిరక్షకుడు ఉపాధ్యాయుడు, అందుకే మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకు ఇవ్వడం జరిగింది. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే, నడక నేర్పిన నాన్న రెండవ గురువు, ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యాబుద్ధులు అందించే మహోన్నత వ్యక్తి మూడో గురువు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చే గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన గురువు శ్రేష్టుడు, మేధావి, విద్యావేత్త రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి వారసులమని చెప్పుకోడానికి మాకు గర్వకారణము. 

జాతి కుల మత వర్గాలకు అతీతంగా విశ్వమానవ సౌభ్రాతృత్వానికి మేధస్సుకు దగ్గరగా ఉండే మన విద్యా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల అధీనంలో ఉంది. ఈ రెండు రంగాలలో ప్రైవేట్ వ్యవస్థదే పైచేయి అని చెప్పవచ్చు. 

దేశంలో ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో మన తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ 2019 -20నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్రం తాజాగా విడుదల చేసింది నివేదికలో ప్రైవేట్ పాఠశాలల సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, పాఠశాల కార్యక్రమాలు మరియు షెడ్యూల్ ని అందిస్తాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కంటే ఎక్కువ గంటల పాఠశాలకు హాజరు అవుతున్నారు అని అర్థం. దీనర్థం ఇబ్బందిలోకి రావడానికి తక్కువ సమయం, మరియు కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అందుకే రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతుంది. 

ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడి బహుముఖ పాత్ర.

పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమో గానీ, ప్రైవేట్ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదు ఇది యధార్థం. కొందరుంటారు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా లభిస్తుందని. ఇది నాణెంలో ఒక భాగమే రెండో భాగం ఉంది అదే ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు శరవేగంగా దూసుకు పోతున్నాయి. 

ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు చాలా మంది తమ రంగంలో నిపుణులు మాస్టర్స్,మరియు డాక్టర్ డిగ్రీలను కలిగి ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ ఉపాధ్యాయులు భావోద్వేగాలకు ఎన్నో ఒత్తిళ్ళకు లోనవుతు కూడ కొత్త కరిక్యులమ్ ఉపోయోగించి బోధనలో సృజనాత్మకతను, శాస్త్రీయతను జోడిస్తూ ప్రభావవంతంగా బోధిస్తారు విద్యార్థుల భవిష్యతే లక్ష్యంగా పరమావధిగా భావిస్తూ రోజుకు 9 గంటల నుండి 10 గంటలు వెచ్చిస్తారు,ఆదివారం కూడా అడ్డు చెప్పకుండా వెళ్తారు. విద్యార్థుల బంగారు సౌధానికి నిచ్చెనలు వేస్తూ ప్రోత్సహించేవారు లేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు. 

విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడే ఈ ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా విధానాలు సక్రమంగా లేవు ఉపాధ్యాయులు సంక్షేమం పట్ల శ్రద్ధ చూపడంలేదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల సవతి ప్రేమ చూపిస్తున్నది. ఇదీ సరైంది కాదు ఉపాధ్యాయుడు ఎక్కడైనా ఉపాధ్యాయుడే, అది ప్రభుత్వ ఉపాద్యాయుడా లేక ప్రైవేట్ ఉపాధ్యాయుడా ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల వివక్షను విడనాడాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ప్రైవేటు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి వారి యొక్క ఉపాధ్యాయు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చూడాలని మనవి చేస్తూ ఈ ప్రైవేటు ఉపాధ్యాయులు…. 

ఇట్లు, 

TAPTA(తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్)

వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, 

చందర్ లాల్ నాయక్ చౌహన్, 

8328268480, 

9177883128.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *