నిరు పేదలకు నిత్యావసరాల పంపిణీ

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం

వరంగల్ సిటి నేటిధాత్రి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గత కొన్ని రోజులుగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్న విషయం తెలిసిందే గతంలో పారిశుద్ధ్య కార్మికులు , ఆశా వర్కర్లు, టైలర్స్ , ఆటో డ్రైవర్లు , హిజ్రాలు , మెకానిక్స్ , రిక్షా కార్మికులు , ఇలా అన్ని రంగాల పేదలకు కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో భాగంగా శనివారం సుమారు 150 మంది ఇళ్లలో పనిచేసే కార్మికులకు , సుద్ద (ముగ్గు) అమ్ముకుని జీవించే కార్మికులకు
వంట బియ్యం , నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన పశ్చిమ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల,కార్మికుల పక్షపాతి అని కార్మికుల కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. దాదాపు 55 రోజులుగా లాక్ డౌన్ మూలంగా అనేక మంది అసంఘటిత రంగ కార్మికులు తమ జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాక్ డౌన్ మూలంగా కరోనా వైరస్ భయంతో ఇళ్లలో పనిచేసే వారిని యజమానులు తమ ఇళ్లలోకి రనివ్వటం లేదని దాంతో వీరందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి వారికి నిత్యావసర సామాగ్రి అందజేయడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో టీఆరెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *