ధర్నాను విజయవంతం చేయాలి

ధర్నాను విజయవంతం చేయాలి

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో పోరాటకారులను విడిపించుట కోసం ఈనెల 31న చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలేంద్ర వెంకటేశ్వర్లు, గుంటి ప్రకాష్‌, చింతకింది శ్రీను, నల్ల రవీందర్‌, గొడిశాల ప్రత్యుష, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇంచార్జ్‌ డ్యాగల శ్రీనివాస్‌, మన్నే రామ్మోహన్‌, సనవులుల స్వామి, మర్రి రాజు, కోమండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *