తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేసిన బిజెపి నాయకులు….

వినాయక నగర్ (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా),
06 నవంబర్ (నేటిధాత్రి):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం 137 డివిజన్ పరిధిలోని వినాయక నగర్ చౌరస్తాలో ,రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్బంధం కారణంగా మనస్తాపం చెందిన శ్రీనివాస్ చనిపోయిన కారణం వల్ల ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు వినాయక్ నగర్ సంతోష్ మాత చౌరస్తాలో 137 డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో,తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మణిరత్నం, ఎక్స్ కౌన్సిలర్ గౌలికర్ ఆనంద్,బీజేపీ సీనియర్ నాయకులు సర్వేశ్ యాదవ్, మంగేష్, దొమ్మాటి సంతోష్ కుమార్,జెనీగ వెంకట్ యాదవ్, గోపాల్, శంకర్ గౌడ్, జహంగీర్ యాదవ్, అన్వేష్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *