డిగ్రీ లెక్చరర్‌ రాధికకు డాక్టరేట్

డిగ్రీ లెక్చరర్ రాధిక భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో ఆప్టిక్స్ విధానంలో పలు అంశాలపై ఆమె పరిశోధన గ్రంథం రూపొందించారు. రాధిక‌ నారాయణ గూడలోని బాబూ జగ్జీవన్ రాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర శాఖాధిపతిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. ఈ పరిశోధన రాధికకు కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. ఆర్. సాయన్న పర్యవేక్షణలో జరిగింది. ఈ పరిశోధనకు సహకరించిన కాలేజీ ప్రిన్సిపాల్ పి.వి.గీతాలక్ష్మి, సహా అద్యాపకులు పట్నాయక్, కో గైడ్ గా వ్యవహరించిన నిజాం కాలేజీ అధ్యాపకులు డాక్టర్. ఎం. కేశవులు గౌడ్, కుటుంబ సభ్యులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *