త్వరలోనే లబ్దిదారులకు అందిస్తాం , కేటీఆర్

పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

 

హైదరాబాద్,నేటిదాత్రి: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి లబ్దీదారులకు అందిస్తామని రాష్ట్ర పురపాలక,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
బుధవారం బెడ్ రూమ్ ఇళ్ల కార్యక్రమం పైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం మంత్రులు కేటిఆర్,వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి నగర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ లతో పాటు ఉన్నతాధికారులు మరియు హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కొన్నిచోట్ల చేయడం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసిన లబ్దిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హా చేయడానికి ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పూర్తి శ్రద్ధ వహించి ముందకుపోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *