మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ…
గాంధీ ఆసుపత్రిలో ఈరోజు రూ. 13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఅర్ఐ మిషన్, రూ. 9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మొదటి సారి వచ్చినపుడు ఇక్కడ రు. 2.14 కోట్ల విలువైన సిటీ స్కాన్ ను ప్రారంభించుకున్నం.
గాంధీ ఆసుపత్రిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాదాపు 100 కోట్లతో అత్యంత అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూరుతున్నాయి.
గాంధీలో రు. 55 కోట్లతో ఎం సి హెచ్ నిర్మాణ పనులు, రు. 2 కోట్లతో 100 పడకల ఐసియు పనులు, దాదాపు కోటి రూపాయలతో పేషంట్ షల్టర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.
రు. 30 కోట్లతో స్టేట్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రు. 2.50 కోట్లతో ఏర్పాటు చేసే ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ సంతాన సాఫల్య కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుంది.
సంతానం లేని దంపతులకు ఇది వరంగా మారనుంది. రాష్ట్రంలో ప్లేట్ల బురుజు, వరంగల్, గాంధీ ఆసుపత్రుల్లో 7.50 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం.
సంతానం లేని వారి నుండి ప్రైవేటు కేంద్రాలు పెద్ద మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేంద్రాలను తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.
గాంధీ ఆసుపత్రికి ఘన చరిత్ర ఉంది. తెలంగాణ జిల్లాల నుండి మాత్రమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు.
సమైక్య పాలనలో గాంధీ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రి అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. వసతులు, మౌలిక సదుపాయాలు సమకూర్చడం వల్ల కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది.
గాంధీ ఆసుపత్రి కరోనా సమయంలో అపద్భందువుగా మారింది. సుమారు లక్ష మంది పాజిటివ్ కేసులకు చికిత్స అందించింది. 1698 కోవిడ్ డెలివరీలు చేసింది. 1163 మందికి బ్లాక్ ఫంగస్ సర్జరీలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆసుపత్రులు..ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కొత్త రూపు సంతరించుకున్నాయి.
ఖర్చుకు వెనకాడకుండా ఆసుపత్రుల ఆధునికీకరణ, అధునాతనమైన వైద్య పరికరాలు సమకూర్చడం వల్ల, ఖరీదైన వైద్య సేవలు పేదలకు ఉచితంగా అందుతున్నాయి.
మోకాలి చిప్ప మార్పిడి అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైసలు ఉన్నోళ్లు సర్జరీ చేసుకుంటే పేదలు పంటి కింద ఆ బాధను అనుభవిస్తూ జీవితాంతం ఉండే పరిస్థితి. ఒక్కో ఆపరేషన్ కు ప్రైవేటు లో 2 నుండి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
గాంధీ ఆసుపత్రిలో నాలుగు నెలల్లో 48 మోకీలు ఆపరేషన్లు జరుగగా, ఉస్మానియాలో గత 6 నెలల్లో 50 పైగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. వీటి విలువ మొత్తంగా దాదాపు 2 కోట్ల పైనే ఉంటుంది.
నిజామాబాద్, వేములవాడ, సిద్దిపేట లో మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు ప్రారంభం అయ్యాయి. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టిందా లేదా తెల్సుకునేందుకు, తద్వారా స్టంట్ లు అమర్చి ప్రాణాలు కాపాడేందుకు ఈరోజు గాంధీలో ఏర్పాటు చేసుకున్న క్యాత్ ల్యాబ్ ఉపయోగ పడుతుంది. ఉస్మానియాలో ప్రారంబించిన క్యాత్ ల్యాబ్ వల్ల 250 మందికి గుండె సంబంధ రోగులకు యంజియోప్లాస్టీ, యాంజియో గ్రామ్ చికిత్సలు అందించడం జరిగింది. ఇక నుండి ఈ సేవలు గాంధీలో అందుబాటులోకి వస్తాయి. ఎంజీఎం, ఖమ్మం, అదిలాబాద్ లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. క్యాత్ ల్యాబ్ వల్ల దాదాపు 21 రకాల ప్రొసీజర్స్ చేయడం సాధ్యమవుతుంది.
ఇలాంటి ఖరీదైన చికిత్సలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా అందుతున్నాయి. ఫలానా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన చికిత్స జరిగింది అని మీడియాలో రావడం చూస్తున్నాం.
ఉమ్మడి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వైద్య సేవలు అందుబాటులో లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆ పరిస్థితులు కళ్ళ నిండా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకణ చేయడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుతున్నారు. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు థియేటర్ ఎక్విప్మెంట్, సర్జికల్, ఐసియు, డయాగ్నొస్టిక్ ఎక్విప్మెంట్ సహా అవసరమైన అన్ని వైద్య పరికరాలను ప్రభుత్వం సమకూర్చుతున్నది.
తద్వారా అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు పేదలకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ పాటు ప్రధాన ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, అత్యాధునిక ICU, మోడ్యులర్ థియేటర్స్ , ఎండోస్కోప్స్ , క్యాథ్ ల్యాబ్ వంటి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
గాంధీ, ఒస్మానియా, నిలోఫర్, చెస్ట్, ఎంజీఎం, ENT, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ఆసుపత్రులకు 21 సిటీ స్కాన్ పంపిణీ చేయడం జరిగింది.
అయితే వీటన్నింటి నిర్వహణ ఎప్పటికప్పుడు చేయకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరనట్టే. మరమ్మత్తుల పేరిట వైద్య పరికరాలు వినియోగంలో లేకపోతే అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కెసిఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం రు. 20 కోట్లతో తొలిసారి బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటనెన్స్ పాలసీని తీసుకువస్తున్నది. దీని వల్ల అన్ని ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు ఎల్లప్పుడూ క్రియాశీలకంగా ఉండనున్నాయి. తద్వారా ప్రజలకు తక్షణం నిరంతర వైద్య సేవలు అందుతాయి.
ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు గతంతో పోల్చితే డబుల్ కేటాయింపులు చేశారు. 11, 440 కోట్లు
ఆసుపత్రులలో వ్యాధినిర్ధారణ పరీక్షలకొరకు : 300 కోట్లు
ఆసుపత్రులలో వైద్య పరికరాలు : 500 కోట్లు
ఆసుపత్రులలో సర్జికల్ కొరకు : 200 కోట్లు
ఆసుపత్రులలో మందులకొరకు : 500 కోట్లు
ఆసుపత్రుల నిర్మాణానికి : 2,000 కోట్లు
వైద్య కళాశాల ఆసుపత్రులు : 1,000 కోట్లు
సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు : 1,000 కోట్లు
ఉస్మానియా, గాంధీ, నిమ్స్.. అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు ఈ ధర్మాసుపత్రులే దిక్కు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఏ పెద్ద రోగమొచ్చినా వీటివైపే చూస్తారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఏండ్లు గడిచినా.. జనాభా అంతకంతకు పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదు.
కాని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకటి, రెండు.. కాదు.. ఏకంగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు కాబోతున్నాయి. 2679 కోట్లతో ఏర్పాటయ్యే tims ఆసుపత్రులకు ముఖ్యమంత్రి గారు ఇటీవల శంకుస్థాపన చేశారు. ఇవి ప్రస్తుత ఆసుపత్రులపై పేషెంట్ల ఒత్తిడిని తగ్గించనున్నాయు.
హైదరాబాద్ బస్తీ ప్రజల ఆరోగ్యం కోసం 259 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది. మరో 91 ఏర్పాటు చేసుకోబోతున్నం. ఇవి బస్తీ ప్రజల సుస్తీ పోగొట్టి, దోస్తీ దవాఖానలుగా మారాయి. ఇక పరీక్షలు ఉచితంగా చేసేలా ఏర్పాటు చేసిన టి డయాగ్నొస్టిక్ లో 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. వీటి సంఖ్య 134 పెంచబోతున్నము. ఈసిజి, ఎక్స్ రే, 2 డీ ఏకో వంటి రేడియాలజీ సేవలు 20 హబ్స్ ద్వారా ప్రారంబించుకున్నాము.
ఆసుపత్రుల్లో ఉండే పేషంట్ సహాయకుల కోసం 18 చోట్ల రు. 5 భోజనం అందిస్తున్నాం. షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలా వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. ప్రజలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేస్తున్నది.
కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, Tsmsidc ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఇ రమేష్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తదితరులు
పాల్గొన్నారు.