Headlines

*మేడారం జాతర సమీక్ష లో వద్దిరాజు రవిచంద్ర*

 

కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
-మంత్రులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన గాయత్రి రవి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పై శనివారం మేడారంలో ఉన్నతా స్థాయి సమీక్ష సమావేశం మంత్రులుతో అధికారులతో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. డిజిపి మహేందర్ రెడ్డిలతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్.ఎర్రబెల్లి దయాకరరావులు సుదీర్ఘంగా చర్చించారు. తొలుత హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.CS సోమేష్ కుమార్.DGP మహేందర్ రెడ్డి లను గాయత్రి రవి పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు…అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో మేడారం జాతర శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు గాయత్రి రవితో అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయించారు .ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు. ఎంపీలు మాలోతు కవిత.పసునూరి దయాకర్.MLC లు కడియం శ్రీహరి. బండా ప్రకాష్.MLA లు సితక్క.గండ్ర వెంకటరమణ రెడ్డి.ములుగు ZP చైర్మన్లు కుసుమ జగదీష్.గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *