నెమలి ఏది కన్నప్ప! ఈవెంట్లలో కనిపించని హీరోయిన్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా, మోహన్ బాబు, ప్రభాస్, శరత్కుమార్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు.
ఇప్పటికే అమెరికా, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోప్రత్యేక ఈవెంట్లు సైతం నిర్వహించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.
ఇదిలాఉంటే.. ఈ సినిమా ప్రారంభంలోనే అప్పటివరకు కథానాయికగా ఉన్న నుపుర్ సనన్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
అఖరుకు.. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మెయిన్ ఈవెంట్లోనూ ప్రీతి కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాశం అవుతుంది.
కన్నప్ప సినిమాలో తిన్నడు ప్రేయసిగా, భార్యగా కీలక పాత్ర పోషించిన నటి ఈవెంట్లలో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది.
అంతేకాదు ఇప్పటికే సినిమాలో విష్ణు, ప్రీతి ముకుందన్లపై చిత్రీకరించిన పాట బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
అంతేకాదు అందులో హీరోయిన్కు వేసిన బట్టలు, పాట చిత్రీకరించిన విధానం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ సినిమాలో ఇంత రొమాంటిక్ సాంగ్ ఏంటనే కామెంట్లు వచ్చాయి.
ఇది అసలు భక్తి చిత్రమా లేక రక్తి మూవీనా అనే వరకు వెళ్లింది.
కాగా ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోలోనూ ప్రధానంగా హీరోయిన్ ప్రీతి నటించిన యుద్దం, ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలే అధికంగా చూపించడం విశేషం.
అలాంటిది పాన్ ఇండియాగా విడుదలవుతున్న ఇంత పెద్ద సినిమాలో కీ రోల్ చేసిన నటి ఇ్పపుడు ఎక్కడా కనిపించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్కు చిన్న క్యారెక్టర్ చేసిన సీనియర్ నటి మధుబాల రాగా హీరోయిన్ ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మూవీ యూనిట్ ప్రీతి (Preity Mukhundhan)ని లెక్కలోకి తీసుకోలేదా, ఈవెంట్లకు పిలవడం మరిచారా, కావాలనే దూరం పెట్టారా లేక తనే రానందా అనే ప్రశ్నలు చిత్ర బృందానికి ఎదురౌతున్నాయి.
ఈవెంట్లో సైతం ప్రీతి గరించి, ఆమె పాత్ర, నటన గురించి మాట్లాడినట్లుగా కూడా లేదు.
అఖరకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సైతం కన్నప్ప టీంతో కలిసి ఇంటర్వ్యులు ఇచ్చి సినిమా ప్రచారంలో పాల్గొంటు తన వంతు సాయం అందించారు.
అలాంటిది కన్నప్ప సినిమాలో మెయిన్ పిల్లర్లలో ఒకరైన హీరోయిన్ ఎందుకు ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో ఎక్కడా కనిపించడం లేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సినిమా విడుదలకు మరొ నాలుగు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రీతి ముకుందన్ మీడియా ముందుకు వస్తుందేమోనని బావిస్తున్నారు.