సమావేశానికి హాజరైన ఎంపీ “వద్దిరాజు”
“నేటిధాత్రి” ఎర్రవెల్లి.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)రజతోత్సవం ఈనెల 27వతేదీన జరుగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఖమ్మం, నల్లగొండ,మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో శనివారం సన్నాహాక సమావేశం జరిగింది.
కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్,గుంతకండ్ల జగదీష్ రెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్,రావుల చంద్రశేఖరరెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,వనమా వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.అలాగే,ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి,రేగా కాంతారావు,బానోతు మదన్ లాల్,మెచ్చా నాగేశ్వరరావు,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కంచర్ల భూపాల్ రెడ్డి,బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, ఖమ్మం మాజీ జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.