నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర.!

Goddess Goddess

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర

వరంగల్ నేటిధాత్రి :

జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం వరంగల్ నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు శోభాయాత్ర కన్వీనర్లు పొట్టి శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, దాచేపల్లి సీతారాం తెలిపారు.
సాయంత్రం 5 గంటలకు వరంగల్ స్టేషన్ రోడ్డులోని పోచమ్మ గుడి నుండి శోభాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అమ్మవారి శోభాయాత్ర మేళతాళాలు మరియు ఆడపడుచుల దాండియా ఆటలతో ముందుకు సాగుతుందన్నారు. ఈ శోభాయాత్ర పోచమ్మ గుడి నుండి పోస్ట్ ఆఫీస్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, దుర్గేశ్వర స్వామి విది, పిన్నవారి వీధి, ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్, మీదుగా బట్టల బజార్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రక్కన గల వాసవి మాత దేవాలయం చేరుకుంటుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది.
ఆర్యవైశ్య బంధుమిత్రులందరు శోభాయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శోభాయాత్ర కన్వీనర్లు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!