పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన.

Minister Ponguleti Srinivas Reddy Minister Ponguleti Srinivas Reddy

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో నాయకులు

జైపూర్ ,నేటి ధాత్రి :

 

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చెన్నూర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో సన్మానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై చర్చించడం జరిగిందని అన్నారు.

మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున రాష్ట్ర మంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలు మంచిర్యాల మున్సిపాలిటీ ఇటీవల కార్పొరేషన్ గా ఉన్నతీకరణ జరిగిన సందర్భంగా ఇక్కడ ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ఏ ప్రకటించాలని కోరడం జరిగింది.

అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 5 డిఎ లను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పిఆర్సి కమిటీ నివేదిక తెప్పించుకొని 51% తో వేతన సవరణ చేయాలని,

ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సిపిఎస్ తొలగించి పాత పెన్షన్ ఇవ్వాలని,గో 317 ను సమీక్షించి స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలని,సిపిఎస్,యుపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలనే విధానం ఓపిఎస్ ఇవ్వాలని,చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఇతర 57 డిమాండ్లను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా టీఎన్జీవో పక్షాన కోరడం జరిగిందని తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తానని, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని తెలపడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పోన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కేజియారాణి,రామ్ కుమార్,నరేందర్,తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్,కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!