రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో వెంకటలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఆమెకు ఎవరు బంధువులు లేకపోవడంతో తంగళ్ళపల్లి ఎస్ఐ సుధాకర్ తన వంతు సహాయంగా 5,000 అందించి దగ్గరుండి ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నరేందర్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు కర్ణాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.