గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం ఎప్పుడో.

Panchayat Panchayat

గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం ఎప్పుడో!

ఏండ్లు గడుస్తున్న భవన నిర్మాణం కలగానే మిగిలి పోయిందా!

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడో అనేది మండల ప్రజలు ఆలోచనలో పడ్డారు. గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాపనలు చేసి పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు అధికారుల మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు.మెరుగైన పాలన అందించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలను నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి భవనాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించాలి.గత ప్రభు త్వం పంచాయితీ కార్యాల నిర్మాణానికి నిధులు మంజూ రు చేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృద్ధి ద్యేయం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి అవకాశం కల్పించి, త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ప్రజలు కోరుతు న్నారు.గత ప్రభుత్వం అభి వృద్ధి చేయని ఘనత. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉన్నట్టు అనిపించింది. దీంతో గ్రామపం చాయతీ నూతన భవనానికి మోక్షం కలుగుతుందా.

Panchayat
Panchayat

నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించండి

కందగట్ల సంతోష్ శాయం పేట మండల నివాసి

శాయంపేట మండల కేంద్రంలో నివసిస్తున్న కందగట్ల సంతోష్ మాట్లాడుతూ గ్రామపంచాయ తీ కార్యాలయంలో గదులు లేక ఆరు బయటనే సమావే శాలు, వస్తువులను భద్రపర చడం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.మండల మేజర్ గ్రామపంచాయతీ కాబట్టి నూతన భవనాన్ని ప్రత్యేక హంగులతో ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టాలి. నూతన భవన నిర్మాణం పూర్తి చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతుంది కాబట్టి భవన నిర్మాణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతు న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!