BJP Slams Congress Over Women Reservation Bill
మహిళా విరోధి కాంగ్రెస్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.
బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు
భూపాలపల్లి నేటిధాత్రి
చట్టసభల్లో నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుని కుటిల బుద్ధి చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఆ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు, ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ
చట్టసభల్లో సీట్ల పెంపు పెంచిన సీట్లలో మహిళా రిజర్వేషన్ అమలుకి సంబంధించిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ మహిళా విరోధి బుద్ది మరోసారి చూపెట్టుకుంది, ఈ బిల్లు పాస్ అయి అమలు జరిగితే లోకసభలో దాదాపు 300 మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది అందులో సుమారు 70 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది, ఇలాంటి బిల్లును అడ్డుకుని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్లు చెప్పే మహిళా సాధికారత మహిళలను మోసం చేయడం అని నిరూపించుకుంది.
గతంలో కూడా ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది, దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, సిఎఏ జిఎస్టి అమలు బిల్లులను అడ్డుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ ది, రామ మందిర్ నిర్మాణాన్ని, పాకిస్థాన్ పై చర్యలను వ్యతిరేకించిన దౌర్భాగ్య చరిత్ర కాంగ్రెస్ ది. కాంగ్రెస్ మద్దతుతో అవసరం లేకుండానే ఎన్నో ముఖ్యమైన బిల్లులను ఆమోదించి అమలు చేస్తున్న ప్రభుత్వం మాది, మోదీ నాయకత్వంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కూడా త్వరలో అమలు చేసి తీరుతాం. బిల్లును అడ్డుకుని మహిళా విరోధి బుద్ధి చూపెట్టిన కాంగ్రెస్ ని మహిళా లోకం ముందు దోషిగా నిలబెడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ని మహిళలు రాజకీయంగా సమాధి చేయడం ఖాయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ జిల్లా నాయకుడు కూర సురేందర్ రెడ్డి మాజీ బీజేవై మండల అధ్యక్షుడు పంజాల కుమార్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య బూతు అధ్యక్షులు సుబ్బక్క పల్లె సర్పంచ్ బొడ్డు రాజేందర్ కనిగంటి వెంకటేష్ శ్రీను రమేష్ దేశెట్టి రవీందర్ తదితరు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు
