మూడు సంవత్సరాలు నిండిన పిల్లల్ని అంగన్వాడీ లో చేర్పించండి…

మూడు సంవత్సరాలు నిండిన పిల్లల్ని అంగన్వాడీ లో చేర్పించండి…

అంగన్వాడీ టీచర్ విక్టోరియా

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మూడు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కాకతీయ కాలనీ వన్ సెంటర్ అంగన్వాడి టీచర్ విక్టోరియా అన్నారు. శనివారం అంగన్వాడి కేంద్రంలో సీబీ ఈవెంట్ లో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం, అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి సూపర్వైజర్ సంధ్యారాణి పాల్గొన్నట్లు టీచర్ విక్టోరియా తెలిపారు.ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు బాలామృతంతో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రతి నెల పిల్లల హైట్, వెయిట్ చూపించాలని అన్నారు.ఈ కార్యక్రమానికి కాలనీవాసులు , అంగన్వాడి ఆయా తిరుపతమ్మ పాల్గొన్నారు.

ముదిగుంట లో ఇంకుడు గుంతలను పరిశీలించిన దూరదర్శన్ సిబ్బంది…

ముదిగుంట లో ఇంకుడు గుంతలను పరిశీలించిన దూరదర్శన్ సిబ్బంది

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మండలంలోని ముదిగుంట గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించిన దూరదర్శన్ సిబ్బంది.ప్రధాన మంత్రి మనకి బాత్ ప్రోగ్రాం లో భాగంగా దూరదర్శన్ ఛానల్ వారు శనివారం ముదిగుంట గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను ఇంటింటికి తిరిగి పరిశీలించారు.ఇంకుడు గుంతలు నిర్మాణం వలన లబ్ధిదారులకు,గ్రామానికి జరిగిన ప్రయోజనాలను లబ్ధిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు.వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ లో చేపట్టిన నీటి కుంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి పి.సురేష్,ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్,ఫీల్డ్ అసిస్టెంట్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version