గుట్ట మున్సిపాలిటీలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక సమావేశం
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:
యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని తొమ్మిదో వార్డులో 99 రోజుల పట్టణ ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ నిర్వహించి వార్డులో ఉన్న సమస్యల ను తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ గారికి వివరణ చేస్తానని హామీ ఇచ్చిన కౌన్సిలర్ సాధునేని ధనలక్ష్మి మధుకర్ . ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలంతా పాల్గొని సభను విజయవంతం చేశారు.
ముఖ్యంగా పలు సమస్యలు పై చర్చించడం జరిగింది.
ఇందిరమ్మ ఇల్లులు, ఫ్రీ కరెంట్, లబ్ధిదారులను ఫ్రీ బస్సు, మూడు నెలల సన్నబియ్యం లబ్ధిదారులకు చేరే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మరియు పింఛన్లకు సంబంధించిన పలు విషయాలపై చర్చించడం జరిగింది, రోడ్డుపై అక్రమ నిర్మాణాలు, కాలనీలో పలు సమస్యలపై చర్చించడం జరిగింది.
