ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి..

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజలు చురుకుగా భాగస్వామ్యం కావాలని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద వార్డు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చడం, ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం కోసం వార్డు సభలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.
వార్డులో డ్రైనేజ్ సమస్యలు, మట్టి రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.వార్డు అభివృద్ధి కోసం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, చెట్లను పెంచుతూ పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు.అనంతరం వార్డు ప్రజలతో వివిధ సమస్యలపై చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, డీఎల్పీఓ రాజీవ్ కుమార్, వార్డు ఆఫీసర్ మహమ్మద్ రహీం పాషా, పల్లె దవాఖాన డాక్టర్ భావన, విద్యుత్ లైన్‌మన్ రాజు, ఆర్‌పి సువర్ణ, బీసీ హాస్టల్ వార్డెన్ భాస్కర్, వార్డు సభ్యులు కొలువుల వెంకట్, అరెపెల్లి బాబు, లక్క రాజు, ఆవుల శ్రీకాంత్, పున్నం రాజు, ఎడెల్లి అశోక్, మామిడాల సదాలక్ష్మి, ఉదయగిరి నాగమణి, సరిత తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రగతి ప్రణాళిక…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రగతి ప్రణాళిక

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీ 25వ వార్డులో గురువారం వార్డు సభ నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.వార్డుల్లో డ్రైనేజ్, మట్టి రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం వార్డు ప్రజల నుంచి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కటా ప్రభాకర్, వార్డు ముఖ్యులు కీసర నరేందర్, కీసర వెంకటేశ్వర్లు, కాటా అఖిల్, కీసరి రాజీవ్, నల్గొండ వంశీ, స్వామిశెట్టి శేఖర్, శోభన్ బాబు, చీకటి శివమణి, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్, ఎస్‌ఎల్‌ఎఫ్ ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version