సీసీ కెమెరాల పునరుద్ధరణ – ఎస్సై ముప్పు సురేష్ చొరవ ప్రశంసనీయం…

సీసీ కెమెరాల పునరుద్ధరణ – ఎస్సై ముప్పు సురేష్ చొరవ ప్రశంసనీయం
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

https://youtu.be/ooGYBXQUVCQ?si=jFfBx1SsO_kmQKBp

మొగుళ్లపల్లి గ్రామంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన సుమారు 24 సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయకుండా వృథాగా ఉండటం గమనించబడింది. ఈ కారణంగా గ్రామంలో భద్రతా వ్యవస్థ కొంత మేర బలహీనపడిన పరిస్థితి నెలకొంది.ఈ పరిస్థితిని గమనించిన మొగుళ్లపల్లి ఎస్సై ముప్పు సురేష్ స్వయంగా చొరవ తీసుకుని, ప్రత్యేక శ్రద్ధతో ముందుండి కెమెరాల మరమ్మతు పనులు చేపట్టించి, అన్ని సీసీ కెమెరాలు తిరిగి సక్రమంగా పనిచేసేలా చేశారు. ఆయన పట్టుదలతో చేసిన ఈ చర్య గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. సీసీ కెమెరాల పునరుద్ధరణతో గ్రామంలో నేరాల నియంత్రణకు దోహదపడటమే కాకుండా, అనుమానాస్పద సంఘటనలను పర్యవేక్షించేందుకు మరియు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు పోలీసులకు సహకారం లభిస్తోంది. దీంతో గ్రామ ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరిగి, పోలీసులపై విశ్వాసం మరింత బలపడింది.

సీసీ కెమెరాల అందజేసినగొల్ల, కురుమ సంఘం సభ్యులు…

సీసీ కెమెరాల అందజేసినగొల్ల, కురుమ సంఘం సభ్యులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామానికి గొల్ల కురుమ సంఘం సభ్యులు సీసీ కెమెరా ను అందజేశారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన సంఘం సభ్యులు సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ కు సీసీ కెమెరా ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో ఇలాంటి దొంగతనాలు, గొడవలు జరిగిన సిసి కెమెరా ఆధారంగా పసిగట్టవచ్చన్నారు. అలాగే మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చి సహాయ పడవలసిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ సభ్యులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు

హిమ్మత్ నగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం….

హిమ్మత్ నగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం

సి సి కెమెరాలు ప్రారంభిస్తున్న హుజురాబాద్ ఏసిపి మాదేవి

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామంలో శుక్రవారం రోజున జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ , ఎస్సై ఆవుల తిరుపతి ప్రారంభించిన మార్నింగ్ వాక్ ఇన్ విలేజి కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల తో మాట్లాడి వారి సహకారంతో 3 సోలార్ కెమెరాలు మరియు 04 ఫిక్స్డ్ కెమెరాలు మొత్తం 07 కెమెరాలు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా హుజురాబాద్ ఏసీపీ మాధవి హాజరయ్యారు సీసీ కెమెరాలకు సహాయం చేసిన ముఖ్య దాతలు మ్యాక రమేష్, నల్ల తిరుపతి రెడ్డి, గెల్లు మల్లయ్య, శ్రీకాంత్, వీరయ్య, సమ్మయ్య లతో పాటు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది , ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version