*కళాకారుడి అంతిమయాత్రలో ప్రభుత్వ విప్ బిర్లా అయిలయ్య
# కళాకారుడు ఎండి జహంగీర్ అంతిమయాత్రలో పాల్గొని శవపేటికను(జానాజా డోలి)ని మోసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు.
నేటిదాత్రి యాదాద్రి:
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గాయకుడు కళాకారుడు యండి జహంగీర్ గారు గురువారం రోజు గుండె పోటు తో మృతిచెందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎండి జహంగీర్ గారి శవపేటిక(జానాజా డోలిని)బీర్ల అయిలయ్య గారు మోసి ఘనమైన నివాళులర్పించారు.
ఎండి జహంగీర్ గారి గురించి మాట్లాడుతూ కళతో ప్రజల గుండెల్లో చైతన్యం నింపిన గొప్ప యోధుడు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అలాగే తన వంతుగా ఎండి జాంగిర్ కుటుంబానికి సహకారం అందిస్తామని తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రస్తుత సమయంలో గజ్జెల శబ్దంలో గళమెత్తిన విప్లవ స్వరానికి జోహార్లు తెలిపారు.బడుగు బలహీన వర్గాల కన్నీళ్లను గీతలుగా మలిచిన మహానుభావుడికి నివాళులు తెలిపారు.
తన గాత్రంతో ప్రజా సమస్యలను ప్రపంచానికి వినిపించిన మహోన్నత వ్యక్తిత్వానికి జోహార్లు,
కళాకారుడిగా మాత్రమే కాదు, సమాజ మార్గదర్శిగా నిలిచిన మహానుభావుడికి,
ఆయన స్వరం ఆగిపోయినా, ఆయన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
