మంచిర్యాలలో టీఎన్జీవో సభ్యత్వం నమోదు

టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వం నమోదు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టారు. సోమవారం టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి హాజరయ్యారు.అదేవిధంగా మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపూరావు టీఎన్జీవో ఉద్యోగుల సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.మున్సిపల్ కార్పొరేషన్,కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కలసి 97 నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టిఎన్జీవో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు.అనంతరం టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష,కార్యదర్శులు,సభ్యులు కలసి ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో మీ యూనిట్లలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులను కలిసి డిసెంబర్ 10 లోగా టీఎన్జీవో సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా నిలవాలని తెలిపారు.ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సమస్యల పరిష్కారంలో ముందుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ అనురాగ్,మున్సిపల్ శాఖ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి,కరుణాకర్ పాల్గొన్నారు.

టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులుగా గిరిధర్ రావ్..

టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులుగా గిరిధర్ రావ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ననువాల గిరిధర్ రావు, కార్యదర్శిగా జడ కమలాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పశువైద్య పశుసంవర్థక అధికారి డా.లింగారెడ్డి, జిల్లా టిఎన్జివోస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, టిఎన్జివిఏ రాష్ట్ర అధ్యక్షులు బింగి సురేష్ లు హాజరై మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించి, నూతన కార్యావర్గానికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈకార్యక్రమంలో డా.వినోద్ కుమార్, అభిషేక్ రెడ్డి, సంగెం లక్ష్మణ్ రావు, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, హార్మిందర్ సింగ్, కిరణ్, రాజేష్ భరద్వాజ్, చిరంజీవి, భాగ్య, వేణుగోపాల్ రెడ్డి, రఫీయుల్లా, తోట రాజు, విజయలక్ష్మి, బి.రాజు, శ్రీనివాస్, మమత, ప్రణయ్, క్రాంతి, రాము, సత్యలక్ష్మి, రజిత, అనిత, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version