టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులుగా గిరిధర్ రావ్
కరీంనగర్, నేటిధాత్రి:
తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ననువాల గిరిధర్ రావు, కార్యదర్శిగా జడ కమలాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పశువైద్య పశుసంవర్థక అధికారి డా.లింగారెడ్డి, జిల్లా టిఎన్జివోస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, టిఎన్జివిఏ రాష్ట్ర అధ్యక్షులు బింగి సురేష్ లు హాజరై మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించి, నూతన కార్యావర్గానికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈకార్యక్రమంలో డా.వినోద్ కుమార్, అభిషేక్ రెడ్డి, సంగెం లక్ష్మణ్ రావు, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, హార్మిందర్ సింగ్, కిరణ్, రాజేష్ భరద్వాజ్, చిరంజీవి, భాగ్య, వేణుగోపాల్ రెడ్డి, రఫీయుల్లా, తోట రాజు, విజయలక్ష్మి, బి.రాజు, శ్రీనివాస్, మమత, ప్రణయ్, క్రాంతి, రాము, సత్యలక్ష్మి, రజిత, అనిత, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
