మోటార్లతో పీల్చేస్తున్నారు.

మోటార్లతో పీల్చేస్తున్నారు

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు ఆయకట్టు వద్ద చెరువులో నుండి మోటార్ల ద్వారా పొలాలకు నీటిని అక్రమంగా వాడుతున్నారు. చెరువులో నుండి నీటిని మోటార్ల ద్వారా వాడడం చట్టరీత్యా నేరం అయినా కూడా కొందరు వ్యక్తులు చట్టాలను పట్టించుకోకుండా ఇష్టానురీతిలో చెరువు నుండి మోటార్ల ద్వారా నీటిని పొలాలకు వాడుతున్నారు. అధికారులకు ఈ విషయం తెలిపిన మౌనంగా ఉంటున్నారని గిద్ద చెరువు నీటి వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు నీటిని వినియోగిస్తున్న వ్యక్తులకు సన్నిహిత సంబంధాల వల్ల పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. చెరువు నీటిని నమ్ముకొన్న రైతులు చెరువు అడుగంటి పోతే మా పొలాలకు నీరు ఎలా అందుతుందని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మోటార్లను సీజ్ చేసి, మోటార్లను వినియోగించిన వారిపైన చర్యలు తీసుకోవాలని నీటి వినియోగదారులు కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version