ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్
పరకాల నేటిధాత్రి
ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను పురస్కరించుకొని పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకులు మడికొండ.
సంపత్ కుమార్ జామా మజీద్ దగ్గర హాజరై మజీద్ ఇమామ్ అజీజ్ కి,మజీద్ కమిటీ అధ్యక్షులు గౌస్ ఉద్దీన్,పెద్దలు మసూద్ అలీకి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రవక్తల అచంచలమైన దైవభక్తి,త్యాగానిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని అన్నారు.
ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరిని ఆ అల్లా చల్లగా చూడాలని అల్లాను వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో బజరుద్దీన్, అఫ్జల్,అజ్గర్ అలీ,ఎస్కే మోయిన్,పాషా,షబ్బీర్ అలీ, ఇస్సాక్ అలీ,సాజిద్,జావేద్, అలీ,ఉస్మాన్,మదర్, బియాభాని,రహీం,ఇక్పాల్, అజీమ్,హబీబ్,ముస్లిం పెద్దలు,యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.