గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

బక్రీద్ పండుగ పురస్కరించుకొని గోవధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కు మండల పరిధిలో గోమాత హత్యలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మండల పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాలను నివారించాల్సిందిగా అదేవిధంగా గోమాత హత్యలను అరికట్టే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, కోశాధికారి మురికి మనోహర్, నాయకులు వల్లే పర్వతాలు, కొండ్లె రమేష్, కౌడగాని రాజేందర్, తిమ్మాపురం శివ తదితరులు పాల్గొన్నారు.

గోహత్యలు అక్రమ రవాణాను అరికట్టాలి.

గోహత్యలు అక్రమ రవాణాను అరికట్టాలి
బీజేవైఎం నాయకులు వినతి

నిజాంపేట నేటి ధాత్రి:

గోహత్యలు, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని బీజేవైఎం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్చార్జ్ ఎస్సై సృజనకు గో హత్యలు, గోవుల అక్రమ రవాణా చేసే వారిని కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవులు దైవ స్వరూపమని అలాంటి గోవులను కొంతమంది హత్యలు చేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆవును తల్లిలా భావించి గోమాత అని పిలుచుకునే సాంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం ప్రశాంత్ గౌడ్, బోయిని ప్రణయ్ కుమార్, గజం రాజు, మేకల రమేష్, సందీప్ గౌడ్, బాసం అనిల్, భరత్,  లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version