షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం.

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం నందు అడ్మిషన్లు ప్రారంభం

★వార్డెన్ చంద్రకళ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం ఝరాసంగం మండలం సంగారెడ్డి జిల్లా నందు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుచున్నవని గర్ల్స్ హాస్టల్ వార్డెన్ చంద్రకళ తెలిపారు. వసతి గృహంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలు, పాఠశాల బోనఫైడ్ మరియు 3 పాస్పోర్ట సైజ్ ఫోటోలతో ఝరాసంగం బాలికల వసతి గృహము ను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.వసతి గృహంలో సంప్రదించగలరు అడ్మిషన్లు కావలసినవారు ఈ యొక్క నెంబర్ను సెల్ 97010 88952 సంప్రదించగలరు.

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జుంజుపల్లి నర్సింగ్ నియామకం

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లాకు చెందిన జుంజుపల్లి నర్సింగ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సంఘం విస్తరణ,బలోపేతం చేయడం కోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరం అన్నారు.గతంలో విద్యార్థి, యువజన,ప్రజా పోరాటాల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర ను పోషించి,ఉమ్మడి రాష్ట్రానికి నాయకత్వం వహించిన నర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సమర్థవంతుడని కొనియాడారు.సంఘం బలోపేతం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలను ఐక్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా పనిచేయాలని కోరారు.దాని కొరకు సంఘంలో ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నర్సింగ్ మాట్లాడుతూ.. నా పట్ల విశ్వాసంతో సంఘం బలోపేతం కోసం బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version