షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం నందు అడ్మిషన్లు ప్రారంభం
★వార్డెన్ చంద్రకళ
జహీరాబాద్ నేటి ధాత్రి:
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం ఝరాసంగం మండలం సంగారెడ్డి జిల్లా నందు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుచున్నవని గర్ల్స్ హాస్టల్ వార్డెన్ చంద్రకళ తెలిపారు. వసతి గృహంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలు, పాఠశాల బోనఫైడ్ మరియు 3 పాస్పోర్ట సైజ్ ఫోటోలతో ఝరాసంగం బాలికల వసతి గృహము ను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.వసతి గృహంలో సంప్రదించగలరు అడ్మిషన్లు కావలసినవారు ఈ యొక్క నెంబర్ను సెల్ 97010 88952 సంప్రదించగలరు.